ఇబ్రహీంపట్నం జూలై తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి.

Published: Friday July 15, 2022
ఘనంగా మూడవరోజు గురుపౌర్ణిమ ఉత్సవాలు*

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ సత్యనారాయణ గుట్టపై కొలువై ఉన్న సద్గురు సాయినాధ్ ఏకశిల మందిరంనందు గురు పౌర్ణమి వేడుకలు మూడోరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయ నిర్వాహకులు శ్రీరమ్య వేణుగోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి. మూడవ రోజు ఉదయం హారతి, నిజాభిషేకం, అర్చనలు, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యమాలు, తిరిగి సాయంత్రం అర్చనలు, హారతులు అంగరంగ వైభవంగా జరగగా.. సుమారు వేయిమందికి పైగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా బిజెపి నాయకులు, సెన్సార్ బోర్డ్ సభ్యులు బోసుపల్లి ప్రతాప్, బిజెపి  జిల్లా కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, బిజెవైయం రాష్ట్ర అధికారిక కార్యదర్శి  రమణసింగ్, టిఆర్ఎస్ విధ్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి పి. రాజ్ కుమార్, టిఆర్ఎస్ 9వ వార్డ్ ప్రెసిడెంట్ కరుణాకర్, మున్సిపల్ సంయుక్త కార్యదర్శి శివరాజ్ గౌడ్, సిద్దం నరేందర్, కాంగ్రెస్ నాయకులు రాములు, జంగయ్య, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు గోగులపాటి జ్యోతి కృష్ణమోహన్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
 
 
Attachments area