రైతన్న పొలం వద్ద కే కరోనా వాక్సిన్

Published: Tuesday October 05, 2021
మధిర, అక్టోబర్ 04, ప్రజాపాలన ప్రతినిధి : హా కోయాలి చేను అంటూ అభ్యుదయ కళా కారుడు వంగ పండు ప్రసాదరావు వ్రాసిన మాటలు గుర్తుకొస్తున్నాయ్ అలుపు సొలుపు లేకుండా పొలంలో పని చేసుకొంటూ కరోనా వాక్సిన్ వేయించుకోవటంలో అలసత్వం వహిస్తున్న వారిని గుర్తించి వెతికి వారు పొలం పని చేస్తూ ఉంటెవారి వద్ద కు వెళ్లి పారామెడికల్ లంకా కొండయ్య పిహెచ్సి దెందుకూరు తరుపున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఈ రోజు దెందుకూరు జిపి ఖమ్మం పాడు జిపి పరిధిలో పొలం గట్ల వద్ద కు వెళ్లి రైతు కూలీలను చైతన్య పరచి టార్గెట్ పూర్తి చేస్తున్నారు. వారి వెంట ఏమర్జెన్సీ మెడికల్ కిట్టు ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి  వెంకట కృష్ణా దంపతులు సహకారంతో వాక్సిన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ ఆరోగ్య సిబ్బంది ఎఎన్ఎం అరుణ ఎఎన్ఎం భారతి జిపి సెక్రటర్రిలుగా స్రవంతి వి కిరణ్ ఆశ కార్యకర్తలు జిపి సిబ్బంది పాల్గొన్నారు.