మతతత్వ బిజెపి పార్టీని రాష్ట్రంనుంచి వెళ్లగొట్టడానికి టిఆర్ఎస్ పార్టీకి సహకరించాం.

Published: Thursday November 10, 2022

 అలాగని పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోం.

-టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిలో  వచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి.-
-అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్లు కటించివ్వాలి.

-భూమి లేని పేదలకు మూడెకరాలు ఇవ్వాలి.

*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్*

చేవెళ్ల నవంబర్ 09 (ప్రజాపాలన):-

ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం లో నీ చేవెళ్ల శంకరపల్లి షాబాద్, మొయినాబాద్ మండలాల ఇల్లు లేని పేదవారికి డబల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వాలని మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించి చేవెళ్ల ఆర్డిఓ ఆఫీస్ ముందు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై మైనారిటీలపై దాడులు పెరిగాయని పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు అదేవిధంగా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కింది అన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్