కమనీయం,రమణీయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం

Published: Saturday February 25, 2023

రాయికల్,ఫిబ్రవరి24(ప్రజాపాలనప్రతిని): రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అయిన శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా, రమనీయంగా కన్నుల పండుగగా అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. రాయికల్ మండల నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామి గోవిందా,జై శ్రీమన్నారాయణ! అంటూ భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఆలయ నిర్వహణ కమిటీ అన్నదానకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మండల ఎంపీపీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ అన్నవేనివేణు, ఫ్యాక్స్ ఛైర్మన్ ఏనుగుముత్యంరెడ్డి, బిజెపి నాయకులు గంగారెడ్డి, ఆలయచైర్మన్ సంకోజిశ్రీనివాస్, అర్చకులు కృష్ణ ,శ్రీనివాస్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.