మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఎస్సిటి చైర్మన్, టిఎన్ఎంవిఎస్ రాష్ట

Published: Tuesday April 04, 2023

జన్నారం, ఏప్రిల్ 03, ప్రజాపాలన:  ఈ నెల ఏప్రిల్ 8వ జన్నారం మండల కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కనెక్షన్ హాల్లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ గోడపత్రలను టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, సాయిని ప్రసాద్ ఆవిష్కరించారు. సోమవారం ఈ మహనీయుల జయంతి ఆయన ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్  రామ్ ముగ్గురు మహనీయుల జయంతి ఉత్సవాల వేడుకలను ఒకే వేదిక మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలను  ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా  ప్రొఫెసర్ జాడి ముసలయ్య, రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. సందర్భంగా ప్రసాద్ నేత మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకునే వేదికగా, వారి ఆశయాల కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విద్యావంతులుగా, ప్రజాప్రతినిదులుగా, ఉపాధ్యాయ సంఘాలుగా, కుల సంఘాలుగా, ప్రజాసంఘాలుగా, జన్నారంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖానాపూర్ నియోజకవర్గం శాసన సభ్యురాలు అజ్మీర రేఖా నాయక్ హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ జాడి ముసలయ్య, రాష్ట్ర టీఎస్ టి డబ్ల్యూ డి చీఫ్ ఇంజనీర్ శ్రీ ముడిమడుగుల శంకర్, ఐటిఓ అధికారి ప్రకాష్ రాథోడ్ హజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ వి ఎస్ సలహాదారులు డా దుర్గం శంకర్ బోర్లకుంట దీపక్ కుమార్, టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం వినోద్, డిఎన్ఎంవిఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జనుగురు ప్రశాంత్, రాష్ట్ర నాయకులు రామటంకి శివ కార్తీక్, సాయిని సాయికుమార్, దుర్గం అంబేద్కర్, జాడి దుర్గాప్రసాద్, రాజకుమార్ దుర్గం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.