పెట్రోల్ పంపు ను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి

Published: Thursday December 02, 2021
కాగజనగర్ డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడ సమీపంలో బుధవారం నూతన భారత్ పెట్రోల్ పంప్ ను ప్రముఖ కాంట్రాక్టర్ హైమద్ హుస్సేన్ స్థాపించారు ఈ సందర్భంగా జడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విటల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, జిల్లా ఎస్పీ (అడ్మిన్) వైవిఎస్ సుధీంద్ర, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.