టిఆర్ఎస్ కార్యకర్తల అభినందన సమ్మేళన ధర్మోజి గూడెం, ఎల్లంబావి,

Published: Monday November 14, 2022

చౌటుప్పల్, నవంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): మునుగోడు ఎన్నికలు గెలుపొందిన టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పాటుపడ్డ ధర్మోజి గూడెం ఎల్లం బావి గ్రామస్తులకు అభినందన సమ్మేళన ఏర్పాటు చేయడం జరిగింది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టిఆర్ఎస్ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలిపారు గ్రామంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే అని అన్నారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు అన్నారు ఎలాంటి పథకాలు అయినా అభివృద్ధి అయినా అది కేవలం టిఆర్ఎస్ పార్టీతోనే అవుతుందని అన్నారు, ధర్మోజి గూడెం ఎల్లం బావి గ్రామస్తులు అందరూ మైనంపల్లి హనుమంతరావు నీ శాలువాతో  పూలమాలలతో  సత్కరించారు ఈ కార్యక్రమంలో ధర్మోగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల సింహాద్రి, గునిగంటి శంకర్, మండల శాఖ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, గుర్రం కొండల్, కొంతం దామోదర్ రెడ్డి, పిసాటి భూపాల్ రెడ్డి, ఐతరాజు లింగస్వామి, కుంకులం కృష్ణ, ఎoగాలి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,