ఉప్పల్లో బోనాలకు ముందస్తు ఏర్పాట్లు

Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్లో బోనాల దృశ్య ముందస్తు ఏర్పాట్లను కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి చేస్తున్నారు. ఉప్పల్లోని మహాంకాళి ఆలయ ప్రాంతంలో ఒపెన్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండడం వలన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. డివిజన్లోని మిగతా ఆలయాల వద్ద కూడా ఇదే తరహాలో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టనున్నట్టుగా రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వసంత, మహంకాళి లక్ష్మణ్, నరేష్, గుమిడెల్లి రాజు, మహంకాళి వంశీ, పాలడుగు లక్ష్మణ్, రాజేందర్, రాఘవేందర్, సుమన్ హనుమంతు, మెనంపల్లి ఆండాళమ్మ, నాగరాజ్, బాలాచారి, హరి గౌడ్ జీతు తదితరులు పాల్గొన్నారు.