కమలం గూటికి ఆళ్ళపాడు మాజీ ఎంపీటీసీ మంద రాజ్యం

Published: Thursday December 09, 2021
బోనకల్, డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మందా రాజ్యం సిపిఎం పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు గేల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి సాదరంగా మందా రాజ్యంని ఆహ్వానించి వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బీజేపీ పార్టీలో చేరిన మంద రాజ్యం మాట్లాడుతూ గతంలో నేను వామపక్షాల పార్టీ వివిధ శాఖల్లో పని చేసాను. ఎంపీటీసీగా గెలుపొంది ఎన్నో ప్రజా సేవలు నిర్వహించారు. వామపక్షాల సిద్ధాంతాల పట్ల ఆయా నాయకుల నిరంకుశ విధానాల వల్ల విసుగుచెంది నరేంద్రమోడీ సుపరిపాలన, బీజేపీ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఆశయాలు కు ఆకర్షితులై ముందుగా నేను ఒకరిగా బీజేపీ లో చేరాను. నా వెనుక వామపక్షాల నుంచి పది కుటంబాలు చేరటానికి సిద్ధముగా ఉన్నాయని తెలియ చేస్తూ నాకు పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చిన నిర్వర్తించడానికి సిద్దముగా ఉన్నాను అని తెలిపారు. నేను పార్టీలో చేరటానికి ప్రోత్సహించిన జిల్లా ఓబీసీ మోర్చాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళపాడు గ్రామానికి చెందిన జిల్లా ఓబీసీ కార్యదర్శి జంపాల రవి, మండల అధ్యక్షుడు విరపనేని అప్పారావు, Sc మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్, బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు కాలసాని పరశురాము, మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరీదు పరశురాముడు, గ్రామ అధ్యక్షుడు దొంతేబోయిన వెంకట్రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర నాయకులు విజయజయరాజు, కిసాన్ మోర్చా నాయకులు రామయోగేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.