మండలంలో ఘనంగా మెుహరం

Published: Thursday August 04, 2022
జన్నారం, ఆగస్టు 03, ప్రజాపాలన: మండలంలోని జన్నారం, పోన్కల్, గాంధీ నగర్, కిష్టాపూర్, దేవుని గూడ, కవ్వాల్, ఇందన్ పల్లి, మందపల్లి, చింతగూడ, మహమ్మదుబాద్, తపాలా పూర్,గ్రామలలో నేలకోల్పిన ఫీర్ల ఊరేగింపు చేస్తారు. కులమతాలకు అదితంగా ఉత్సవాలలో పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన ఫీర్ల ముస్లీం, హీందువులు జరుపుకుంటారు. మత సామరస్యానికి చాటిచేప్పే విధంగా హిందూ, ముస్లీం కలసి చేసుకునే మెుహరం పండుగ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  మండలంలో జన్నారం, పోన్కల్, గాంధీ నగర్, కిష్టాపూర్, దేవుని గూడెం, కవ్వాల్, ఇందన్ పల్లి, మహమ్మదుబాద్, తపాలా పూర్, చింతగూడ, మందపల్లి, గ్రామాలలో గత ఆదివారం నుండి పదకొండు రోజులపాటు ఫీర్ల పండుగ కోనసాగనున్నట్లు తెలిపారు. మెుహరం ఉత్సవాలు ముస్లింల ఆద్వర్యంలో కొనసాగుతాయి. ఈ సందర్భంగా పతిమాబి తల్లి గుర్తుగా హస్సేన్ హుస్సేన్ ఫీర్ల మసీదులలో ఫీర్ల ప్రతిష్టాపనతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుపుకుంటారు. కులమతాలకతీతంగా హిందూ, ముస్లిం సోదరులు తరలివస్తారు. మెుహరం ఉత్సవాలను మండలంలో ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు, ఈ కార్యక్రమంలో ఎమ్ డి రహీం, ఎమ్ డి ఆలీబాబా, ఎమ్ డి అబ్బాస్, ముస్లింలు, మండల అధికారులు, మండల తాహసిల్థర్ ఇట్యాల కిషన్, స్థానిక ఎస్ఐ పి సతీష్, ఎంపిడివో అరుణరాణి, మండల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపిపి మాదాడి సరోజన, మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు బోర్లకుంట ప్రబూదస్, బిజేపి మండల బిజేపి అధ్యక్షుడు గోలి చందు, మండల బిజేవైఎం అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్, యంపిటిసిలు, సర్పంచ్ లు, పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.