ఘనంగా రాజీవ్ గాంధీ 30 వర్ధంతి వేడుకలు

Published: Saturday May 22, 2021
మధిర, మే 21, ప్రజాపాలన ప్రతినిధి 21వ తేదీ మధిర మండలంరేణుకా చౌదరి గారి ముఖ్య అనుచరుడు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవ్వాజీ ఆనందరావు గారి ఆదేశాల మేరకు మధిర మున్సిపాలిటీ పరిధిలోని 1 వార్డులో గల రాజీవ్ గాంధి విగ్రహానికి  దోర్నాల వెంకటరవి గ్రామ పెద్దలు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి విగ్రహానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు... కరోణ సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైజర్ వాడుతూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు దోర్నాల ఏసుపాదం, కుటుంబరావు, లక్ష్మణరావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.