కనుల పండుగగా నగర సంకీర్తన
బోనకల్, జనవరి 4 ప్రజా పాలన ప్రతినిది: మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గ్రామ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల నగర సంకీర్తన కార్యక్రమం కనులపండుగగా సాగింది. గ్రామంలోని అయ్యప్ప స్వాములు అందరూ శివాలయం గుడి నుంచి పలు కాలనీల మీదుగా అయ్యప్ప నగర సంకీర్తన ర్యాలీని నిర్వహించారు. ప్రత్యేక నృత్యాలు, భాజా భజంత్రీలతో, మేళ తాళాలతో పాటల ద్వారా అయ్యప్ప స్వాములు సందడి చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప స్వాముల భక్త బృందం తో పాటు గ్రామ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ పాల్గొని అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన కార్యక్రమమును ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ మహేశ్వరరావు (గురుస్వామి)బాదావత్ దేవదాస్ (గురుస్వామి) మరీదు రామారావు, భూక్య శీను (గురుస్వామి), అయ్యప్ప స్వాములు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నగర సంకీర్తన కార్యక్రమంను జయప్రదం చేశారు.
Share this on your social network: