అంగరంగ వైభవంగ రథోత్సవం
రాయికల్, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ రథోత్సవం కన్నులపండుగగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ రాజరాజేశ్వరస్వామి వారు కళ్యాణం జరుపుకొన్న మూడవరోజైన (సోమవారం) భక్తుల కోలహాలాల,మంగళ వాయిద్యాల,డప్పుచప్పుల్లా మధ్య రథోత్సవం వైభవోపేతంగా జరిగింది.ఈ రథోత్సవకార్యక్రమాన్ని పురస్కరించుకొని కొత్తపేటగ్రామవాసులు ఆలయ ప్రాంగణంలోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అశ్విని జాదవ్, ఎంపీపీ సంధ్యారాణి, కొత్తపేటగ్రామసర్పంచ్ బత్తినిరాజేశం, ఉపసర్పంచ్ కాటిపల్లి రాజశేఖర్ రెడ్డి, ఆలయచైర్మన్ దొనకంటి ప్రవీణ్, శివాజీనగర్ (వడ్డెర కాలనీ)సర్పంచ్ వెంకమ్మనరసయ్య ,ఆలయ ఈ.ఓ విక్రమ్ గౌడ్, ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయఅర్చకులు రాజేశ్వరశర్మ, రాంగోపాలచారి, శ్యాంసుందరచారి, చుట్టుపక్క గ్రామాల భక్తులు,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: