శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, ఉత్సవాలు

Published: Friday February 04, 2022
మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఉదయం 8:00 లకు వాసవి పతాక ఆవిష్కరణ మరియు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో  నిర్వహించారుఅనంతరం ఆలయ కమిటీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు కావడం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దిగ్విజయం చేశారని భక్తులు అమ్మవారి కృపకు పాత్రులై అయ్యారనిఆలయ కమిటీ తెలిపింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు, దేవాలయ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు