మానవత్వం చాటుతున్న తిరుమలాయపాలెం పోలీస్ రక్షకభటులు అనేదానికి అర్థం ఇది చాలు

Published: Monday March 21, 2022
పాలేరు మార్చి 20 ప్రజాపాలన ప్రతినిధి : ప్రస్తుత సమాజంలో మానవత్వం కనుమరుగవుతున్న నేపధ్యంలో పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. పోలీసులు ప్రజల రక్షణకే కాదు కష్టసమయాల్లోనూ తోడుగా నిలుస్తున్నారు.. పోలీసుల్లో కర్కశత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించారు తిరుమలాయ పాలెం పోలీసులు.. అర్థం ఇది చాలు తిరుమలాయపాలెం మండలం పిండిప్రొల్ పెట్రోల్ బంకు సమీపంలో ఓ వ్యక్తి అచేతనంగా పడి వున్నాడు. వంటిపై ఎలాంటి దుస్తులు కూడా లేవు. అప్పుడే అటువైపు పెట్రోలింగ్ వెహికిల్ లో వెళ్తున్న పున్నయ్య, హరికృష్ణ, బాలరాజు అనే పోలీస్ కానిస్టేబుళ్లు గమనించారు. పోలీసులు ఆ వ్యక్తి పరిస్థితి చూసి చలించి పోయారు. వెంటనే అతనికి బట్టలు వేసి, మంచినీరు తాగించారు. తినడానికి పండ్లు ఇచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని పిండిప్రొల్ గ్రామంలోకి పంపించారు. ఇది చూసిన పరిసర ప్రాంతాల ప్రజలు శభాష్ పోలీస్ అంటూ ప్రసంశించారు