సంజీవ నగర్ గ్రామంలో దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి వేడుకలు

Published: Saturday May 22, 2021
పరిగి, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం,దోమ మండల పరిధిలోని దొంగ ఎంకేపల్లి (సంజీవ నగర్ ) గ్రామంలో దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డి నిర్వహిచడం జరిగింది. అనంతరం ఆయన రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్న  కారణంగా భౌతిక దూరని పాటిస్తూ మాస్కు ధరించి ఈ కార్యక్రమాన్ని ఇంటి ఆవరణలో నిర్వహించడం జరిగింది అని సర్పంచ్ అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, సైదులు, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.