మల్లారం లో పిడుగుపాటుకు గురై వలస గొర్రెల కాపరి మృతి

Published: Friday April 16, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 15వ తేదీ మల్లారం గ్రామం వారి స్వగ్రామం తరలించేందుకు సహాయం చేసిన సర్పంచ్ మందడపు ఉపేంద్రమండల పరిధిలో నిమల్లవరం గ్రామంలోఈరోజు ఉదయం అకాలవర్షం సమయంలో పిడుగు పాటుకు గురై ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాకు చెందిన నరసింహ యాదవ్ మృతి చెందాడు. అయితే నరసింహ యాదవ్తన గొర్రెలతో మల్లవరం గ్రామం లోని ఒక రైతు వ్యవసాయ పొలాల్లో కొద్ది రోజులుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. నరసింహ యాదవ్ మృతదేహాన్ని వారి స్వగృహం తరలించేందుకు సుమారు 20 వేల రూపాయలు ఖర్చు కాగా అతను పనిచేసే స్థానిక రైతు నుండి ఆ 20 వేల రూపాయలు వారికి ఇప్పించి అతని మృతదేహాన్ని వారి స్వగ్రామం తరలించేందుకు మల్లారం సర్పంచ్ మందడపు ఉపేంద్ర చొరవ తీసుకున్నారు. సర్పంచ్ సహాయానికి మృతులు కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.