శ్రీ మత్స్యగిరేంద్రుని సన్నిధిలో ఘనంగా గ్రామ సర్పంచ్ దంపతుల పెళ్లిరోజు వేడుకలు

Published: Wednesday February 15, 2023


శంకరపట్నం ఫిబ్రవరి 14 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ ఆవరణంలో మంగళవారం ఆలయ చైర్మన్ సాగి మలహళ్ రావు, బిఆర్ఎస్ నాయకుడు ఉమ్మెంతుల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగట్టు గ్రామ సర్పంచ్ ముకిరాల కిషన్ రావు, ముకిరాల కళ దంపతుల పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులను శాలువాతో సన్మానం చేసి, కేక్ కట్ చేపించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు ఈ వేడుకలు నిర్వహించినందుకు ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.