తల్లాడలో తెదేపా ప్రచార రథం ప్రారంభం..

Published: Friday December 16, 2022
 తల్లాడ, డిసెంబర్ 15 (ప్రజాపాలన న్యూస్):
 ఈనెల 21వ తేదీన ఖమ్మంలో  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏర్పాటుచేసిన ప్రచారరథాన్ని గురువారం తల్లాడలో ఆ పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్,  తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, కల్లూరు మండల అధ్యక్షులు బానోతు చిట్టిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రచార రథాలు ప్రతి మండలంలో, గ్రామాల్లో ప్రజలకు మైకు  ద్వారా ప్రచారం  చేస్తాయని తెలిపారు. ఖమ్మంలో సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సరికొండ శ్రీనివాసరాజు, పరుచూరి సురేష్ కృష్ణ, కందుల నారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, ఎండి బాబు, కృష్ణ, కొమ్మినేని రాము, కొమ్మూరి అప్పారావు, రావూరి రవి ప్రసాద్, శీలం నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.