శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణానికి హాజరైన-- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
Published: Wednesday March 08, 2023
రాయికల్, మార్చి 07 ;(ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంవద్ద 5 లక్షల రూ.ల నిధులతో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ భూమారావు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, కార్యదర్శి తలారిరాజేష్, మండల రైతు బంధుసమితి కన్వీనర్ మోహనరావు, భూపతిపూర్ గ్రామసర్పంచ్ చంద్రశేఖర్ భక్తులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: