శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday February 08, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 7 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్లోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు పల్లె  నర్సింగ్ రావు, కొంపల్లి రవీందర్ ముదిరాజ్, టంటం వీరేశం, గుడి మధుసుధన్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్, వేముల పరమేష్, మైనారిటీ అధ్యక్షులు ఎస్ కె అబ్బు భాయ్, కొంపల్లి రాజు ముదిరాజ్, చిల్కానగర్-ఉప్పల్ డివిజన్ల యూత్ అధ్యక్షులు సీత రాజు యాదవ్, అరటికాయల వంశీకృష్ణ ముదిరాజ్, చిలుగురి శ్రీకాంత్, బండి లింగన్న, మధు, వలబోజు శ్రీకాంత్ చారి, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.