మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ నిర్వహణకు 5000 ఆర్థిక సహాయం చేసిన ఎస్. ఐ. విజయ కృష్ణ

Published: Tuesday May 04, 2021

గుమ్మడిదల, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తున్నందుకు గాను దాని నిర్వహణ కొరకు గుమ్మడిదల ఎస్.ఐ.విజయ కృష్ణ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు, ఈ సందర్భంగా ఎస్.ఐ. విజయ కృష్ణ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ యాక్సిడెంట్ అయిన మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని,ఈ అంబులెన్స్ నిర్వహణలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్, హెడ్ కానిస్టేబుల్ కరీం, రైటర్ సికిందర్,మహిళ కానిస్టేబులు తదితరులు పాల్గోన్నారు.