భాజపా పాదయాత్రకు అడుగడుగున జననీరాజనం

Published: Monday September 19, 2022
మాజీ మంత్రి బిజెపి నాయకుడు ఏ చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 18 సెప్టెంబర్ ప్రజా పాలన : ప్రజాగోస బిజెపి భరోసా పాదయాత్రకు అడుగడుగున జననీరాజనం పలుకుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుగుతూ భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడం శుభపరిణామం అని కొనియాడారు. ఏ మనిషిని పలకరించిన ఎక్కడ చూసినా సమస్యలే అడుగడుగునా  కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే నియోజకవర్గంలో మీ సమస్యలపై నా పోరాటం  ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆలంపల్లిలో పర్యటించిన సందర్భంగా వృద్ధ మహిళలకు పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం వృద్ధుల ఉసురు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పాదయాత్ర చేస్తున్న ఆయనకు ప్రజలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను వస్తున్నా... మీ సమస్యల పై నేను చేసే పోరాటానికి మద్దతు ఇవ్వండని కోరారు. రండి నాతో కలిసి అడుగు వేయండి అందరము కలిసి వికారాబాద్ నియోజకవర్గం వికాసం కొరకు పాటుపడుదామని పిలుపునిచ్చారు.