ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు
15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 ( ప్రజాపాలన ): ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని 15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో శివారెడ్డి పేట్ పిఏసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ పాష సమక్షంలో " మా శారద ఆసుపత్రి " సౌజన్యంతో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అంబప్రసాద్, డాక్టర్ ప్రణతిల సహకారంతో సాకేత్ నగర్, కమల్నగర్, మారుతినగర్, లాలాగూడ, కార్తికేయనగర్, ఎన్నేపల్లి కాలనీలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఉచితంగా బి.ఎం.ఐ ( బాడీమాస్ ఇండెక్స్ ) బిపి షుగర్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పలు జబ్బులతో బాధపడే వారు ఉచిత వైద్య శిబిరానికి వచ్చి చూపించుకోవాలనే సూచించారు. వైద్యో నారాయణ హరిః అనగా వైద్యుడు నారాయణ తో సమానం అని కొనియాడారు. భగవంతుని ముందు మనం ఏమీ దాచమో అలాగే డాక్టర్ల ముందు తనకు వచ్చిన జబ్బుల గురించి దాచకుండా చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మా శారద ఆస్పత్రి సిబ్బంది, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: