మడుపల్లిలో ప్రమాదవశాత్తు గేదె మృతి* మధిర రూరల్ సెప్టెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday September 29, 2022
మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లిలో కనకపుడి ప్రసాద్ రోతమ్మ దంపతులు గేదెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు మేత మేపటం కోసం దగ్గర్లో ఉన్న డుబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గరికి తోలుకొని పోగా దురదృష్ట వశాత్తు ఇండ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయి చనిపోయింది. కండ్ల ముందే దాదాపు లక్ష రూపాయల విలువ చేసే  నెలలు నిండిన బర్రె సెప్టిక్ ట్యాంక్ లో ప్రాణం విడవటంతో పేదరాలు అయినా రూతమ్మ బోరున విలపిస్తూ,మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని ప్రభుత్వ అధికారులు  ఆదుకోవాలని కోరుతున్నారు... నామమాత్రంగా సెప్టిక్ ట్యాంకులు నిర్మాణం వల్ల సుమారు లక్ష రూపాయల విలువ గల గేదెను కోల్పోవడం జరిగింది కావున కుట ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది మండల కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ