సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ, సర్పంచ్.

Published: Saturday November 05, 2022
అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) అశ్వారావుపేట లోని పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీ లో ఐదు లక్షల రూపాయలతో మండల పరిషత్ నిధుల నుండి మంజూరు కాబడిన  సీసీ రోడ్డుకు స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, గ్రామపంచాయతీ సర్పంచ్ నార్లపాటి సుమతి లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పంచాయతీ నిధులు విడుదల కాగానే మిగిలిన రోడ్లకు కూడా సిసి రోడ్లుగా విడతలవారీగా మారుస్తామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. మండల పరిషత్ నిధుల నుండి మోడల్ కాలనీలో సిసి రోడ్డు ఏర్పాటు చేసినందుకు మండల పరిషత్ వారికి సర్పంచి నార్లపాటి సుమతి ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన సమస్యలు కూడా పంచాయతీ నుండి పరిష్కారమయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె పాషా, ఎంపీటీసీ మిండా హరిబాబు, పంచాయతీరాజ్ వర్క్ ఇనస్పెక్టర్ శ్యామ్, ఉప సర్పంచ్ తగరం జగన్నాథం, వార్డు మెంబర్లు చిప్పనపల్లి శ్రీను, గంధం సుజాత, తగరం బేబీ,నార్లపాటి రాములు, తగరం రాజేష్, తాతారావు,  నార్లపాటి సోమేష్, రాఘవేందర్, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.