అథ్లెటిక్ కోచ్ గడప రాజేష్ కు అరుదైన అవకాశం మంచిర్యాల బ్యూరో, జూన్30,ప్రజాపాలన:

Published: Friday July 01, 2022
 మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన అథ్లెటిక్ కోచ్ గడప రాజేష్ కు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్ లో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ట్రేడ్ మిల్, జిమ్ సైకిల్   ఇన్స్ పెక్టర్ గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం  రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్ జింఖాన గ్రౌండ్ లో సాట్స్ అథ్లెటిక్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.