దుర్గా పరమేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

Published: Tuesday October 04, 2022
మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ ప్రక్కన గల వెలుగు గుట్ట శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి వారి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు అమ్మలగన్నయమ్మ దుర్గా పరమేశ్వరి అలంకారంలో దుర్గాష్టమి రోజున భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం పంచామృతాభిషేకం, శ్రీ సూక్త, దుర్గాసూక్త విధానంతో మహాభిషేకం, దుర్గా దేవి అలంకారం ,సువాసునులచే కుంకుమార్చన, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన వచ్చిన భక్త జన సందోహంతో జరిగినది. తదనంతరం చండీ హోమము, మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి, మహామంగళహారతి తీర్థప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిగాయి .ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదో రోజు కూడా అన్నదాతలచే అన్నప్రసాద వితరణ విశేషమైన భక్తుల నడుమ జరిగినది. సాయంత్రం ప్రదోష అర్చనలో శ్రీచక్రానికి కుంకుమార్చన ఎనిమిది గంటలకు ఊంజల సేవ, మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమాలను దేవాలయవిశేషమైన భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు.