కెసిఆర్ ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజల గుదిబండగా మారింది కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప

Published: Saturday July 02, 2022
బెల్లంపల్లి జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల బ్రతుకులు బాగుపడతాయని, తెలంగాణ ప్రజలు ఆశించితే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కుటుంబ పాలనతో నాలుగు కోట్ల మంది ప్రజానీకాన్ని మోసం చేసి గద్దెనెక్కి తెలంగాణ ప్రజల మీద పాలన చేస్తూ గుడిబండగా మారిండని కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, కవీందర్ గుప్తా విమర్శించారు.
శుక్రవారం  స్థానిక శిశు మందిర్ పాఠశాలలో పట్టణ బిజెపి అధ్యక్షులు కోడి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు, 
 తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని,  ప్రజలు ఆశిస్తే  కెసిఆర్ కుటుంబం నాలుగు కోట్ల మంది ప్రజానీకాన్ని మోసం చేసి గద్దెనెక్కి, తెలంగాణ ప్రజల మీద గుదిబండగా మారిందని అన్నారు.
 తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ అబద్ధపు మాటలతోటి అబద్ధపు వాగ్దానాలతోటి పబ్బం గడుపుతున్న, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బిజెపేనని, మూడవ తారీఖున నరేంద్ర మోడీ  బహిరంగ సభతో తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ భరోసా ఇవ్వబోతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీ  పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తుందని , టీఆర్ఎస్ కుటుంబ అవినీతి పాలనను తెలంగాణ ప్రజలు కచ్చితంగా బొందపెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని అన్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాలపల్లి మాజీ అధ్యక్షులు వెన్నంపల్లి పాపన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ . కొయ్యల ఏమాజీ . రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుల్లెడ్ల కేశవరెడ్డి . జిల్లా ఉపాధ్యక్షులు పులుగం తిరుపతి . జిల్లా కార్యదర్శి కోయల్కర్ గోవర్ధన్. రేవెల్లి రాజలింగు . రాజులాల్ యాదవ్. మరియు పట్టణ పదాధికారులు వివిధ మోర్చాల పదాధికారులు బూతు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area