సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది మేయర్ జక్క వెంకట్ రెడ్డి
Published: Tuesday March 14, 2023
మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి)
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు.సీఎం సహాయనిధి నుండి బి. నగేష్ కు మంజూరైన రూ 35 వేల చెక్కును కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్ లబ్దిదారునికి అందజేశారు.ఈ సందర్బంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి ద్వారా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: