అర్హత కలిగిన జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.యం.అర్.ఒ. కి ఎనతి

Published: Tuesday May 31, 2022
పాలేరు మే 30 ప్రజాపాలన ప్రతినిధి
అర్హత గల  జర్నలిస్టు లకు వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని నేలకొండపల్లి ప్రింట్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ దార ప్రసాద్, కు వినతి పత్రం అందించారు .నేలకొండపల్లి లోని పనిచేస్తున్న జర్నలిస్ట్  ప్రతి ఒక్కరికి నిబంధనలు సడలించి అక్రిడేషన్స్ ఇవ్వాలని, ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ కార్డు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మైసా శ్రీనివాస రావు, 
ప్రధాన కార్యదర్శి. గంజికుంట్ల వెంకన్న,గౌరవ అధ్యక్షులు పెంటమల్ల కోటయ్య,
ఉపాధ్యక్షుడు వంగవీటి పవన్,
కోశాధికారి విజయ్, సహాయ కార్యదర్శి మామిడి ప్రవీణ్,   అడెపు ఉపేందర్, ఐ జే యు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి పొలంపల్లి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు..