కోరుట్ల లో సెల్ఫ్ లాక్ డౌన్

Published: Wednesday May 12, 2021
కోరుట్ల ,మే 11( ప్రజా పాలన ప్రతినిధి) : ప్రస్తుతం కోరుట్ల పట్టణములో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎక్కువ వ్యాప్తి చెందడం వలన గత 15 రోజుల నుండి పట్టణములో అనేక మంది కరోనా బారిన పడి మరణించడం జరిగినది. కావున పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడుటకు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుటకు మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారు. అనగా తేది:11-05-2021 నుండి 21-05-2021 వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించబడును కేవలం కూరగాయాలు, కిరాణ వ్యాపారస్తులు మరియు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు పార్సిల్ సర్వీస్ మాత్రమే ఉదయం 6.00 గం||ల నుండి 10.00 గం||ల వరకు అనుమతి, మెడికల్ మరియు అత్యవసర సేవలకు మినహాయింపు కలదని తెలిపారు.