స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన సూదా రఘు గురుస్వామి..

Published: Tuesday November 08, 2022
తల్లాడ, నవంబర్ 7 (ప్రజా పాలన న్యూస్):
కార్తీకమాసాన్ని పురస్కరించుకొని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో సోమవారం అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకు గ్రామానికి చెందిన డీలర్ సూదా రఘు (గురుస్వామి) అధ్వర్యంలో భిక్షను ఏర్పాటుచేశారు. తొలుత రఘుగురుస్వామి కుటుంబసభ్యులు మండలంలోని లక్ష్మీ నగర్ గ్రామం వద్ద ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకు ప్రత్యేక భిక్ష ఏర్పాటుచేశారు. ప్రజలందరికీ మేలు జరగాలని, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని  పూజలు చేశారు. గోవిందు సురేష్ స్వామి, తాళ్లూరి నరసింహారావు, కొమరాజుల రాము స్వాములు ప్రత్యేక గేయాలాపనతో స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు అధికసంఖ్యలో పాల్గొన్నారు.