ఎన్టీఆర్ కు నివాళులర్పించిన పబ్బతి శేఖర్ రెడ్డి
Published: Saturday May 29, 2021
మేడిపల్లి, మే28 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు 98వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలకానగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి డివిజన్లోని బీరప్పగడ్డ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటిస్తూ, కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పబ్బతి శేఖర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: