డిజేఎఫ్ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం.

Published: Friday December 30, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్29, ప్రదాపాలన:
 
 
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హై-టెక్ సిటీ ప్రాంతంలో జిల్లా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తాడేం .రాజ్ ప్రకాష్, అధ్యక్షులు తీగల. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి కర్రె. రాజేశ్వర్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు. మల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిజే ఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని. కృష్ణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ లు ఐక్యమత్యంతో  ప్రజల సమస్యలను పరిష్కారించే వారధి లా ఉండాలని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ ల సంక్షేమము కోసం పాటు పడాలని కోరారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ,డి జె ఎఫ్ జిల్లా , జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన డి జె ఎఫ్ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఘన సన్మానం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మెన్ పెంట. రాజయ్య మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం డి జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాది రెడ్డి, ఉపాధ్యక్షులు నారమళ్ళ. విజయ్, అనంత రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు , మహర్షి మల్లన్న, బుచ్చి రామి రెడ్డి,మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ప్రధాన కార్యదర్శి కొండ. ప్రవీణ్, ఉపాధ్యక్షులు పులి. రాజా రామ్,పెద్ద పల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా మున్సిపల్ చేర్మెన్ పెంట. రాజయ్య, యం. సి. పి. ఐ (యు ) జిల్లా కార్యదర్శి సబ్బని. కృష్ణ, వివిధ పత్రికలలో,ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ లు,సురేష్, సత్య గౌడ్, తాడేం. తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.