*చేవెళ్లలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం* పేద బడుగు బలహీన వర్గాల అభివృద

Published: Thursday December 29, 2022
చేవెళ్ల డిసెంబర్ 28 (ప్రజాపాలన):-

కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి  కృషి చేస్తుందని డీసీసీ మాజీ అధ్యక్షులు వెంకటస్వామి,టీ పీసీసీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్  అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ నాయకత్వంలో గరీబీ హటావో నినాదంతో పేద ప్రజలకు ఇల్లు, భూముల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను అమలు జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో గ్రామాల అభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వ్యవస్థను పటిష్టం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి,చేవెళ్ల pacs చేర్మెన్ వెంకట్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ గుండాల రాములు,డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంట్టయ్య గౌడ్,బి బ్లాక్ మాజీ అధ్యక్షులు పడల ప్రభాకర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ,నాయకులు యాదిరెడ్డి, గోపాల్,సాయి వంశీ గౌడ్,తదితరులు పాల్గొన్నారు..