తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన వెల్గటూర్ బి.జె.పి నాయకులు

Published: Thursday February 18, 2021
వెల్గటూర్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన) :  వెల్గటూర్ తాసిల్దార్ కు వెల్గటూర్ మండల బి.జె.పి నాయకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బుధవారం రోజు తాసిల్దార్ ఎం. రాజేందర్ కు వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు తంగళ్ళపెల్లి చక్రపాణి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలనీ, పేద ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. రైతులకు యూరియా బస్తాలు ఉచితంగా పంపిణీ చేయాలని లేని ఎడల వెల్గటూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం తహశీల్దార్ కు మెమోరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు గుంత సంతోష్, మాజీ కార్యవర్గ సభ్యులు క్యాతం సుధాకర్,మండల శాఖ ఉపాధ్యక్షులు గుమ్ముల సతీష్, వెలిచాల సతీష్, నస్పూరి నరసింహ చారి, ప్రధాన కార్యదర్శులు రాయిల్ల రాజమల్లు,అమర గొండ దివాకర్, జక్కుల శేఖర్, కార్యదర్శులు జక్కుల రాజ్ కుమార్, బి.జే.వై.యం మండల శాఖ అధ్యక్షులు దేవి రవీందర్, కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు  రావ్ హనుమంత రావు, ఉపాధ్యక్షులు చెల్పురి మల్లయ్య, ప్రధాన కార్యదర్శులు బుద్దె పోచయ్య, జిత్తవేని రమేష్, కార్యదర్శి ఎల్లంల శ్రీధర్, ఓ.బీ.సీ మండల శాఖ అధ్యక్షులు కందికట్ల రాజేష్,ఎస్సిమోర్చా మండల శాఖ అధ్యక్షులు న్యాతరి మల్లేశం,వాణిజ్య సెల్ కన్వీనర్ మల్యాల దేశ్ముఖ్, మండల నాయకులు సంగ వెంకటగిరి, పొన్నం నరేష్, కరిడే రాజయ్య, భూసారపు వెంకటేష్, రాజయ్య, భూసారపు తిరుపతి, భూసారపు భీమయ్య, శివ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.