ఆర్థిక సహాయం చేసిన టీపీసీసీ సభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్

Published: Saturday October 01, 2022
జన్నారం, సెప్టెంబర్ 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన బచ్చల రాజన్న, దుమల్ల ఇందూర్ ఇటివల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న టిపిసిసి సభ్యుడు ఆదిలాబాద్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు మరణించిన ఇంటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి మనోదైర్యన్ని కల్పించారు. ప్రఘడా సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానాని మాట ఇచ్చారు. శుక్రవారం ఇరు కుటుంబాలకు రూ, ఐదువేల చొప్పున కలిపి రూ, పదివేల రూపాయలను ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోర్లకుంటా ప్రభుదాస్, మండల ప్రధాన కార్యదర్శి ఫసీ ఉల్లా, టౌన్ ప్రెసిడెంట్ దుమల్ల రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మామిడిపెల్లి ఇందయ్య,  వార్డు మెంబర్ బీణవేణి గంగన్న, నాయకులు దూమల్ల రాజలింగు, నారపక శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, జై  కుమార్ దూమల్ల ప్రశాంత్, రోహిదాస్, గ్రామ పెద్దలు దూమల్ల ఎల్లయ్య, సుదాకర్, సురేష్, రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area