పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్
Published: Saturday April 01, 2023
మేడిపల్లి, మార్చి 31 (ప్రజాపాలన
ప్రతినిధి)
విద్యార్థులు కష్టపడి చదివి పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, రాష్ట్ర, జిల్లా స్థాయిలో మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని
పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ సమావేశం కార్యక్రమానకి ముఖ్యఅతిథిలుగా మేయర్ జక్క వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని విద్యార్థిని,విద్యార్ధులకు పలు సూచనలు దిశానిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు మేయర్, కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి హాల్ టికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మనోరంజన్ రెడ్డి,శివరాజు,ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: