అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు

Published: Wednesday December 07, 2022

జన్నారం, నవంబర్ 06, ప్రజాపాలన: అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా బీసీ ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేద్దామని బీసీ సంఘం నాయకులు కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ బిజెపి పార్టీ హరినాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం మండల అధ్యక్షుడు గోలిచంద్, బిజెపి మండల అధ్యక్షుడు ములుగు ప్రవీణ్, బీజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, బిజెపి నాయకులు జక్కుల సురేష్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని జన్నారం మండలంలోని కవ్వాల్ గిరిజన గ్రామాలలోని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిటిసిల పురం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రియాదుద్దీన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని యువతకు సూచించారు.