సీఎం సహాయనిధి పేదలకు వరం మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు
Published: Wednesday March 29, 2023
మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి)
సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పేర్కొన్నారు.
ఒల్డ్ రామంతాపూర్ నివాసులైన బాబు రావు వైద్య పరీక్షల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ 20 వేలు, శ్రీనివాస్ పురంనకు చెందిన నరేష్ కు రూ 42వేలు మంజూరయ్యాయి. మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు బాధిత సభ్యులకు చెక్కులను అందజేశారు.
Share this on your social network: