19వార్డులో సైడ్ డ్రైన్కు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్

Published: Monday June 28, 2021

మధిర ప్రజాపాలన ప్రజలది 27వ తేదీ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో కౌన్సిలర్ ధీరావత్ మాధవి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సైడ్ డ్రైన్ కు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ 19 వార్డ్ పరిధిలో వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా చేయాలంటే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతతో కలిసి పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి వార్డులో కొన్ని లక్షలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, టిఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, సయ్యద్ ఇక్బాల్, తోగరు వరలక్ష్మి, మేడికొండ కళ్యాణి, యన్నంసెట్టి అప్పారావు, ముత్తవరపు ప్యారి, గుగులోతు కృష్ణ నాయక్, వాల్మీకి పవన్ తదితరులు పాల్గొన్నారు.