పట్టణ ప్రగతిలో అభివృద్ధి పనులు

Published: Monday June 13, 2022
మేడిపల్లి, జూన్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమములో ముఖ్య అతిధులుగా   మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమిషనర్  రామకృష్ణారావు, డి ఈ శ్రీనివాస్ పాల్గొని రోడ్ నంబర్ 5 లో మొక్కలు నాటి అనంతరం మంచినీటి పైపులైను నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ ప్రగతిలో  ప్రజలను భాగస్వాములను చేస్తూ  స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త లను వేరువేరుగా వేయాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు . అనంతరం కాలనీ వాసులతో కలిసి వివిధ కాలనీలలో ఓపెన్ ప్లాట్లలో పిచ్చి మొక్కలను ,చెత్తను తొలగించడం రోడ్లకు ఇరువైపుల గల గుంతలను పూడ్చడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు,మున్సిపల్ సిబ్బంది, 11వ డివిజన్ వార్డు కమిటీ సభ్యులు,మహిళా కమిటీ మెంబర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు  పాల్గొన్నారు.