గోపిశెట్టి ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు..

Published: Saturday October 29, 2022
తల్లాడ, అక్టోబర్ 28 (ప్రజా పాలన న్యూస్):
తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు పొంగులేటి అంటే తెలియని వారు ఉండరని, ఏ పదవి లేకపోయినా ఆయనకు ప్రజలే పదవని టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు తెలుసుకుంటున్న జనహృదయ నేత శ్రీనివాస రెడ్డి అన్నారు.
 
 అన్నదానం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ..* 
 
 *పొంగులేటి జన్మదిన వేడుకల్లో భాగంగా కార్యక్రమానికి హాజరైన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికిపైగా బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 
 
 *ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సరికొండ లక్ష్మీ పద్మావతి, తల్లాడ సర్పంచ్ పోట్టేటి సంధ్యారాణి, టిఆర్ఎస్ నాయకులు యరమల వెంకటేశ్వరరెడ్డి, తుమ్మలపల్లి రమేష్, ఎర్రి నరసింహారావు,  జవ్వాజి సుబ్బారావు, బాజోజు శేషభూషణం, ధారా శ్రీనివాసరావు, అనుమోలు సర్వేశ్వరరావు,  దుండేటి కేశవరెడ్డి, తూము వెంకటనారాయణ, గణేశుల రవి, సిరిపురపు శ్రీనివాసరావు, వేమిశెట్టి నాగన్న, సర్పంచులు ఆదూరి దాసురావు, బండారు ఏడుకొండలు, గొడుగునూరి లక్ష్మారెడ్డి, కేతేపల్లి భాస్కర్ రావు, దగ్గులా భద్రారెడ్డి, నరాల గోపాల రెడ్డి, సరికొండ హరీష్ రాజు, దగ్గుల కాంతారెడ్డి, బానోతు నరసింహారావు, పొట్టెటి బ్రహ్మరెడ్డి, సరికొండ అప్పలరాజు, పొన్నం కృష్ణయ్య, గోపాలరావు, రామకృష్ణ, శీలం రాఘవ రెడ్డి, శీనన్న అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.