ఐదు రూపాయలకే రైతన్నలకు భోజనం * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Friday August 26, 2022
వికారాబాద్ బ్యూరో 25 ఆగస్టు ప్రజాపాలన : ఐదు రూపాయలకే రైతన్నలకు వినియోగదారులకు భోజన వసతి మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేయనైనదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ ఫౌండేషన్ సౌజన్యంతో 5 రూపాయలకే అన్నపూర్ణ భోజన పథకాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దీప భక్తవత్సలం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటరెడ్డి సూపర్వైజర్ చోలేటి సాయిల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సోమవారం మరియు గురువారం వారానికి రెండు రోజులలో మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేశామన్నారు. మన ప్రాంతంలో మార్కెట్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రైతుల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు మరియు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రైతులతో కలసి 5 రూపాయల భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ రామ్ రెడ్డి శివారెడ్డి పెట్ పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.