వ్యాక్సినేషన్ పక్రియ పరిశీలన

Published: Monday September 20, 2021
బోనకల్: ప్రజా పాలన ప్రతినిధి 19వ తేదీబోనకల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కరోనా ను సమిష్టిగా  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ హెల్త్ వాలంటీర్స్ క్యాంపెయిన్గ్ లో భాగంగా హెల్త్ క్యాంపెయిన్ కన్వీనర్ దొంతు జ్వాలా నరసింహ, కో కన్వీనర్ కొలిపాక శ్రీదేవి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పక్రియను స్వయంగా పరిశీలించి ఉన్నత ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను సూచించారు. ఇదే సందర్భంలో భారత ప్రధాని మోడీ  జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా సుమారు 2 కోట్ల వ్యాక్సిన్ ఒకేరోజు వేసి రికార్డ్ సృష్టించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సీనియర్ నాయకులు గుడిమళ్ళ పాపారావు, ఎన్ఆర్ఐ బీజేపీ యువనేత బీపీ నాయక్, మండల అధ్యక్షులు అప్పారావు, మండల కార్యదర్శి గంగుల నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, మండల యువ మోర్చా అధ్యక్షుడు పరుశురాం, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు జంపాల రవి, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.