కామదేను ఖమ్మం రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ గా నెల్లూరు వీరబాబు ఏకగ్రీవం.
Published: Friday January 21, 2022
పాలేరు జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : కామదేను ఖమ్మం రైతు ఉత్పత్తిదారుల లిమిటెడ్ కు తొలి చైర్మన్ గా నెల్లూరు వీరబాబు ఉ ఏకగ్రీవంగా ఎన్నికైనారు కంపెనీకి మొత్తం 15 మంది డైరెక్టర్స్ ఒక చైర్మన్ సభ్యుల చే ఏకగ్రీవంగా ఇంకో బడి నారు ఈ కంపెనీ ప్రారంభించి స్వయంగా మార్కెటింగ్ చేసుకుని నూతన పద్ధతులతో స్వయంప్రతిపత్తి సాధించుకుంటాం కావలసిన సహాయ సహకారాలను సభ్యులందరికీ అందిస్తుంది. ప్రభుత్వం గుర్తింపుతో ప్రభుత్వ నిబంధనలతో అధికారుల సూచనలతో ఈ కంపెనీ రైతుల కొరకు ఏర్పడింది ఈ కంపెనీ తమ కార్యకలాపాలను పరిపాలన లావాదేవీలను కొనసాగించు కుంటూ తమ ప్రయత్నం ప్రారంభించింది జిల్లాలోని అతి పెద్ద రైతు ఉత్పత్తి దారుల సంఘం గా ఎదగాలని అందరూ డైరెక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు ఆశాభావం వ్యక్తం చేశారు రైతులు సంఘటితంగా ఉండి నూతన వ్యవసాయ సాగు విధివిధానాలను లాభాలను అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ సలహాలు సహకారం తీసుకుంటూ కంపెనీ అండగా ఉంటుందని తెలుపుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్ నెల్లూరు బాబు గారిని పలువురు అభినందించారు ఈ కంపెనీలో రైతులు అధిక సంఖ్యలో తను స్వతహాగా సభ్యులుగా చేరి ఈ సంస్థలు ముందుకు తీసుకోవలసిందిగా చైర్మన్ నెల్లూరు బాబు కోరారు వ్యవసాయ శాఖ నుండి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కంపెనీ ద్వారా రైతులు లబ్ధి పొందాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ విజయచంద్ర నేలకొండపల్లి వ్యవసాయ శాఖ అధికారి నారాయణ రావు తమ ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం చైర్మన్ వీరబాబు కూర్చుంటూ అభినందించారు
Share this on your social network: