సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ..
Published: Tuesday May 31, 2022
సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి..
తల్లాడ, మే 30 (ప్రజాపాలన న్యూస్): రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి అన్నారు. సోమవారం కుర్నవల్లి సొసైటీలో రైతులకు ఆయన జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు 30 కేజీల జీ తెలుగు ప్యాకెట్ ను 665 రూపాయలకు అందిస్తుందన్నారు. ఒక రైతుకు 1898 రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు. రైతులు పొలంలో జిలుగులు వేయడం ద్వారా మంచి బలం వస్తుందన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతరాజు వెంకటయ్య, ఐలూరు శివారెడ్డి, ఒగ్గు నరసింహారెడ్డి, ఎర్రమల రఘురామ్ రెడ్డి, పాల్గొన్నారు.
Share this on your social network: