మదన్ పల్లిలో సిసి రోడ్ల నిర్మాణం పనులు

Published: Tuesday April 04, 2023
* సర్పంచ్ బండ విజయరాజ్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 03 ఏప్రిల్ ప్రజాపాలన : గ్రామాంతర్గత రహదారి వ్యవస్థను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మదన్ పల్లి గ్రామ సర్పంచ్ బండ విజయరాజ్ ముదిరాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి గ్రామంలో 20 ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపడుతున్నారు. రాగులపల్లి కిష్టయ్య ఇంటి నుండి కొంకల లక్ష్మయ్య ఇంటి వరకు, చిట్టంపల్లి గోపమ్మ ఇంటి నుండి రాగులపల్లి కిష్టయ్య ఇంటి వరకు, కొంకల లస్మయ్య ఇంటి నుండి సరోజనమ్మ గుడి వరకు, జట్నె పాండు ఇంటినుండి నాగుల గుడి వరకు  బండ రాములు ఇంటి నుండి పరిగి చంద్రయ్య ఇంటి వరకు, సంగెపు అంజయ్య ఇంటి నుండి మోముల అడివయ్య ఇంటి వరకు సిసి రోడ్ల నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు లక్ష్మమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.