మరణించిన జంగయ్య కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సహాయం అందజేశారు

Published: Tuesday September 06, 2022

తక్కల్లపల్లి గ్రామానికి చెందిన మేడమోని జంగయ్య ఆర్థిక ఇబ్బందులకు  గురై ఆత్మహత్య చేసుకుని మరణించారు.వారి కుటుంబ బాధను చూసి గ్రామ దాతలు,పెద్దలు,యువకులు ప్రజల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు 1,87200  ఒక లక్షా ఎనభై ఏడు వేల రెండువందల రూపాయలు విరాళాలు సేకరించి  వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.మానవతా  దృక్పథంతో ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హబీబుద్ధిన్, ఉప సర్పంచ్ కావాలి జగన్,ఎంపీటీసీ కుందవరం సుమతమ్మ లోహిత్ రెడ్డి,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు, వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, దేంది మాధవరెడ్డి, బూర్గు జగన్, ఎస్ఎఫ్ఐ విప్లవ్ కుమార్,మెడమెని శేఖర్, కొండాపురం కృష్ణ,శేఖర్,సత్యనారాయణ, మధు, శ్రీనివాస్,సైదులు, సత్యనారాయణ, జంగయ్య మహేష్, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.